vinayaka chavithi pooja book telugu pdf మరియు 21 పత్రాల లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

vinayaka-chaturthi

వినాయక చవితి పూజ PDF కోసం Click on the image to download it

download button for vinayaka-chavithi-pooja-book-pdf

vinayaka chavithi pooja book మానవుడికి ప్రకృతిలోని జీవ జాలానికి ఉన్న అనుబంధం చాటిచెప్పే విశిష్టమైన పండగ వినాయక చవితి వినాయక చవితి పూజలో 21క రకాల ఆకులను పూజ పత్రి గా ఉపయోగిస్తాం ఈ 21 ముక్కులలో ఎంతో ఔషధ విలువలు కలిగి ఉంటాయి వీటిని మన పెద్దలు తరతరాలుగా ఆరోగ్య సంరక్షణంకు ఉపయోగిస్తున్నారు ఈ విలువైన మొక్కల ఔషధాలు గురించి తెలుసుకుని గణనాథుని పండగ జరుపుకుందా.

వినాయక చవితి పూజలో వాడే 21 పత్రాలు vinayaka chavithi pooja telugu

  1. మాచి పత్రము
  2. బృహతి పత్రము
  3. బిల్వపత్రము
  4. దూర్వ పత్రము
  5. దత్తూర పత్రము
  6. బదరి పత్రము
  7. ఆపామార్గ పత్రము
  8. తులసి పత్రము
  9. చూత పత్రము
  10. కరవీర పత్రము
  11. విష్ణుక్రాంత పత్రము
  12. దాడిమ పత్రము
  13. దేవదారు పత్రము
  14. మరుతక పత్రము
  15. సింధువార పత్రము
  16. జాజి పత్రము
  17. గలడలి పత్రము
  18. శమి పత్రము
  19. అస్వత్థ పత్రము
  20. అర్జున పత్రము
  21. అర్క పత్రములు

vinayaka chavithi pooja book

మాచి పత్రము

చవితి రోజు మనం గణపతిని పూజించే మొదట పట్నం మాచిపత్రం ఇది మన దేశంలో ప్రతి చోటా కనిపిస్తుంది మన ఇల్లు చుట్టుపక్కల ఇది విపరీతంగా పెరుగుతుంది ఇది గొప్ప ఆయుర్వేద మూలిక ఇది నేత్రాలు రోగాలకు అందమైన ఔషధం

మాచీపత్రం
  1. మాచిపత్రం ఆకులను నీళ్లలో తడిపి కంటికి చుట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి
  2. చర్మ రోగాలకు నులిపురుగులను, కుష్టు, బొల్లి, దప్పికనుతగ్గిస్తుంది. vinayaka chavithi pooja

బృహతి పత్రము

రెండో పత్రం  బృహతీ పత్రం ఇది కూడా దేశంలో విస్తారంగా పెరిగే మొక్క జాతుల్లో ఒకటి దీనినే మనం వాకుడాకు అని పిలుస్తుంటారు

బృహతీపత్రం
  1. బృహతీ పత్రం నీళ్ళలో బాగా కాచి ఆకులనుఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్లనొప్పులు ఉన్న చోట కట్టుకడితే కాలు నొప్పులు తగ్గుతాయి
  2. బృహతీ పత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది.
  3. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచకుంటే నోటిదుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీ పత్రానికి ఉంది.
  4. బృహతీ పత్రం ఖంట రోగాలకు శరీరంలో శరీర నొప్పులను నయం చేస్తుంది
  5. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది కఫ వాత దోషాలను ఆస్తమా దగ్గు సైన్సెస్ తగ్గిస్తుంది
  6. జీర్ణశక్తిని పెంచుతుంది
  7. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది vinayaka chavithi pooja book

బిల్వ పత్రము

ఇది మనందరికీ బాగా పరిచయం అయింది దీనిని మారేడు అని కూడా పిలుస్తారు పరమేశ్వరుడు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ పత్రం అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మొక్కగా చెపుతుంటారు

బృహతీపత్రం
  1. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మధుమేహం ఉన్నవారు రోజు రెండో ఆకులను నిదానంగా నోమేలే ఈ రసాన్ని మింగితే ఉపశమనం కలుగుతుంది
  2. తాజా మారేడు ఆకుల రసాన్ని కళ్ళుల్లో వేసుకుంటే కల కలగా నుంచి ఉపశమనం కలుగుతుంది
  1. 1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
  2. 2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
  3. 3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.

దూర్వ పత్రము

దూర్వ-పత్రము

దూర్వాయగ్మం అంటే తెలియని వారు ఎవరు ఉండరు అదే గరిక గణపతికి అత్యంత ప్రీతికరమైన పత్రం దూర్వాయగ్మం రెండు జంట కలిగిన ఆకు అని మనం గమనించాలి ఇది ఎక్కడబడితే అక్కడ పెరుగుతుంది ఈ గరిక కూడా మహా ఔషధ మూలిక

  1. గరికను పచ్చడి వేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయం అవుతాయి
  2. అలాగే చర్మం మరియు రక్త వ్యాధులు నుంచి దూరం చేస్తుంది

దత్తూర పత్రము

దత్తూరపత్రం అంటే మనీకి తెలిసిన ఉమ్మెత్త ఆకు ఇది ఉష్ణ తత్వం కలిగి ఉంటుంది

ఉమ్మెత్త
  1. ఆస్తమాను తగ్గిస్తుంది
  2. ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
  3. మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది

బదరి పత్రము

బదరీపత్రం అంటే రేగు ఆకు ఈ రేగు ఆకు అన్న రేగు చెట్టు రేపు అన్న తెలియని వారు ఉండరు ఇది చిన్న పిల్లల వ్యాధులు బాగా నయం చేస్తుంది 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు లో వచ్చే అన్ని సాధారణ వ్యాధులు వ్యాధిని తగ్గిస్తుంది

రేగు-ఆకు
  1. చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
  2. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.
  3. రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.
  4. ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
  5. కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగి పండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.
  6. వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి.
  7. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
  8. అంతేకాదు బాధా నివారిణి, క్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమన కారి. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, *క్తహీనత, నీరసం, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టరీయా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.
  9. విత్తనాలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేవి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.
  10. వెంట్రుకలు పెరగడానికి రేగుపండులు దోహదం చేస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది.

vinayaka chavithi pooja book

ఆపామార్గ పత్రము

గణనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది పత్రంలో ఇది ఒకటి దీనినే ఉత్తరేణి  అని కూడా పిలుస్తారు

ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.

ఉమ్మెత్త
  1. భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
  2. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
  3. అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
  4. అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
  5. ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
  6. ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
  7. అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
  8. మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  9. ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
  10. నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు. vinayaka chaturthi

తులసి పత్రము

తులసి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది పత్రం తులసి ఆకులు వేర్లు కాడలు ఆకులులో ఔషధాలు కలిగి ఉండాలి

తులసి
  1. తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
  2. పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
  4. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
  5. ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
  6. ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక కావచ్చును vinayaka chaturthi

చూత పత్రము

చూతపత్రం అంటే మామిడి ఆకులు ఇందులో కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది

మామిడి
  1. పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంత సేపు మరగ నివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమను కుంటే ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేయవచ్చు.
  2. కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
  3. జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
  4. బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
  5. చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
  6. కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
  7. దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
  8. కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
  9. నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
  10. మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి ఉంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.గ్గిస్తుంది vinayaka chaturthi

కరవీర పత్రము

కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు గన్నేరు ఆకు అంటే వైద్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీలిస్తే చాలు అనేక రాగాలు తగ్గుతాయి

గన్నేరు
  1. దీని నుండి తయారుచేసిన మందులను క్యాన్సర్ చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు.
  2. గన్నేరు చెట్టు ఆకులన తెంచి వాటి నుంచి వచ్చే పాలు తీసేసి ఆ గన్నేరు ఆకులను తడి గుడ్డకు చుట్టి మన ఒంటికి చుట్టుకుంటే ఒంటె లో జర సంబంధిత ఉష్ణ లు ఏమైనా ఉంటే తెలుగు పోతాయి vinayaka chaturthi

విష్ణుక్రాంత పత్రం

విష్ణుక్రాంత-పత్రం

మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.

  • ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
  • ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి.
  • గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

దాడిమీ పత్రం

దాడిమీ-పత్రం

అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

దేవదారు

దేవదారు

ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత  నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

  1. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది.
  2. ఇది చర్మ వ్యాదులు,చిన్న చిన్న దెబ్బలు మానడానకి ఉపయోగపడుతుంది.

మరువక పత్రం

దేవదారు

మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

సింధువార పత్రం

సింధువార-పత్రం

వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన  నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.

  • ఈ ఆకులతో పచ్చడి చేసుకుంటారు.
  • వేడినీళ్ళలో వావిలి ఆకులు వేసి దానిలో గుడ్డ తడిపి కాపడం పెట్టుకుంటారు.
  • కీళ్ళ సంబంధిత విషాలకు విరుగుడు కొందరు వాడుతూంటారు.
  • ఈ ఆకుల వాసన చీకటి ఈగలు రాకుండా నిరోధిస్తుంది.

జాజి పత్రం

సింధువార-పత్రం

జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.

గండకీ పత్రం

గండకీ-పత్రం

దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.

  1. అస్థమ నీ తగిస్తుంది

శమీ పత్రం

గండకీ-పత్రం

దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

ఆశ్వత్థ పత్రం:

ఆశ్వత్థ-పత్రం

patra patri ganesh puja telugu రావి వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.

అర్జున పత్రం

అర్జున-పత్రం

మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.

అర్క పత్రం

అర్క-పత్రం

జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది. patra patri ganesh puja telugu

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి 10 పండ్లు ఇవి